భువనగిరి ఎంపీగా చామల కిరణ్ గెలుపు ఖాయం : మేడి నరేష్

Spread the love

భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమని దళిత్ జస్టిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మేడి నరేష్ అన్నారు. చిట్యాల లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చామల కిరణ్ కుమార్ రెడ్డి సామాన్య కార్యకర్తగా అనునిత్యం ప్రజల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న కుటుంబాల ఇంట్లో పెద్దన్న పాత్ర పోషిస్తూ పార్టీ కార్యకర్తలను, పేదలను ఆదుకునే గొప్ప మనసున్న వ్యక్తియని కొనియాడారు.

2004 నుంచి నేటి వరకు ఏ పదవి ఆశించకుండా ఒక సామాన్య కార్యకర్తగా అనునిత్యం ప్రజలతో మమేకం అవుతూ ఎంతోమంది విద్యార్థుల చదువుల కొరకు, ఆసుపత్రుల అవసరాల కొరకు అనునిత్యం నేనున్నానంటూ ఎంతోమంది కుటుంబాలను ఆదుకున్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజలంతా మద్దతుగా నిలవాలన్నారు. పోలీసుల లాఠీలకు తూటాలకు గాయపడి ఎదురోొడ్డి గత పాలకుల అవినీతిని ఎండగడుతూ ఎన్నో పోరాటాలు చేసిన కిరణ్ కుమార్ రెడ్డిని పార్లమెంట్ కి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు .

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page