పల్నాడు గడ్డ పై నుండి సవాల్ చేస్తున్నా…వచ్చేది తెలుగుదేశమే

Spread the love

నరసరావుపేటలో చంద్రబాబు సభకు స్థలాన్ని పరిశీలించిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు,టీడీపీ నేతలు

పల్నాడు గడ్డ పై నుండి సవాల్ చేస్తున్నా…వచ్చేది తెలుగుదేశమే

నరసరావుపేటలో జరగనున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి సభకు సంబంధించిన స్థలాన్ని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు,టీడీపీ నాయకులు పరిశీలించారు.నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ రెడ్డి చేస్తున్న దగా,ద్రోహాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నారని డా౹౹చదలవాడ పేర్కొన్నారు.

ప్రజాక్షేత్రంలో చంద్రబాబు తిరగకుండా చేసేందుకు కుట్రలు చేసిన జగన్ రెడ్డి,బొక్కబోర్లా పడ్డారన్నారు.చంద్రబాబు బయటకు వచ్చిన రోజు నుండి కూడా జగన్ రెడ్డికి కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు.దగాకోరు ప్రభుత్వం పై దండెత్తేందుకు బెబ్బులిలా చంద్రబాబు వస్తున్నాడు కాస్కో జగన్ రెడ్డీ అంటూ పల్నాడు గడ్డ పై నుండి డా౹౹చదలవాడ సవాల్ చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు,వేల్పుల సింహాద్రి యాదవ్,నల్లపాటి రాము,సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు,కొల్లి బ్రహ్మయ్య,కడియం కోటి సుబ్బారావు,గొట్టిపాటి జనార్ధన్ బాబు,కుమ్మేత కోటిరెడ్డి,చింతిరాల బాలు,కొర్నేపాటి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 12 08 At 5.54.05 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page