జడ్చర్ల పట్టణంలో ఆంజనేయ స్వామి గుడిలో చోరీ

Spread the love

Burglary at Anjaneya Swamy temple in Jadcharla town

జడ్చర్ల పట్టణంలో ఆంజనేయ స్వామి గుడిలో చోరీ

సాక్షిత : జడ్చర్ల పట్టణంలో మూడో వార్డులోని రాజీవ్ నగర్ కాలనీ లోని పబ్బతి అంజనేయ స్వామి గుడిలో దొంగల బీభత్సం ఆంజనేయ స్వామి గుడిలోని హుండీని ధ్వంసం చేసి హుండీలో ఉన్న 50వేల రూపాయలకు పైగా డబ్బులను దోచుకుని వెళ్లారు.

రాత్రి 1:30గంటల ప్రాంతంలో గ్యాస్ కట్టర్ సహాయంతో హుండీని కత్తిరించి దొంగతనం చేసినట్టుగుర్తించారు, పూజారి నరసింహ చారి గుర్తించి స్థానిక కౌన్సిలర్ అయిన దేశావాలి సతీష్ కి దేవాలయం కమిటీ సభ్యులకు సమాచారం అందించారు, కౌన్సిలర్ మరియు దేవాలయ కమిటీ సభ్యులు పరిశీలించిన తర్వాత స్థానిక సీఐ కి సమాచారం ఇవ్వడం జరిగింది,

దొంగతనం జరిగిన గుడిని ఎస్సై వెంకటేశ్వర్లు పరిశీలించి దొంగలను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు, కౌన్సిలర్ దేశావాలి సతీష్ ,మరియు దేవాలయ కమిటీ సభ్యులు, శ్రీనివాసులు, సత్తయ్య ,రాములు , రామకృష్ణ, రమేశ్,కృష్ణ చారి, రాము,కరాటే వెంకటేష్ , నర్సోజి,లు దొంగలను కచ్చితంగా పట్టుకొని శిక్షించాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page