పేద ప్రజలకు ఎంతో ఆసరాగా బిఆర్ఎస్ సంక్షేమ పథకాలు…

Spread the love

రూ. 2,32,26,912 లక్షల విలువ చేసే కళ్యాణ లక్ష్మీ, శాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 232 మంది లబ్ధిదారులకు రూ. 2,32,26,912 విలువ చేసే కళ్యాణ లక్ష్మీ, శాదీ ముబారక్ చెక్కులను చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం.. పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు..

పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను అమలు చేస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, డివిజన్ అద్యేక్షులు, సీనియర్ నాయకులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page