పేద ప్రజలకు ఎంతో ఆసరాగా బిఆర్ఎస్ సంక్షేమ పథకాలు…

Spread the love

పేద ప్రజలకు ఎంతో ఆసరాగా బిఆర్ఎస్ సంక్షేమ పథకాలు…
రూ. 21,02,436 లక్షల విలువ చేసే కళ్యాణ లక్ష్మీ, శాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


*సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధికి చెందిన 21 మంది లబ్ధిదారులకు రూ. 21,02,436 విలువ చేసే కళ్యాణ లక్ష్మీ, శాదీ ముబారక్ చెక్కులను కొంపల్లి లోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం.. పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు.. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను అమలు చేస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ అధికారులు, కొంపల్లి మున్సిపల్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ రవి యాదవ్, వసంత, సీనియర్ లీడర్స్ జండా కుమార్ గౌడ్, బొల్లం వేణు యాదవ్, నరహరి, మహిళా ప్రెసిడెంట్ సంగీత రెడ్డి, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page