సికింద్రాబాద్ ఎం పీ అభ్యర్ధిగా బీ ఆర్ ఎస్ నాయకత్వం

Spread the love

సికింద్రాబాద్ ఎం పీ అభ్యర్ధిగా బీ ఆర్ ఎస్ నాయకత్వం ప్రకటించిన తరువాత సికింద్రాబాద్ శాసనసభ్యులు, పార్లమెంట్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ తొలిసారిగా తెలంగాణా భవన్ కు చురుకొని, బీ ఆర్ ఎస్ నగరధ్యక్షుడు, జుబ్లీ హిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ఏర్పాటు చేసిన పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయు సమావేశంలో పాల్గొన్నారు. బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎం ఎల్ ఏ లు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎం ఎల్ సీ లు ప్రభాకర్, వాణీ దేవి, లతో పాటు హైదరాబాద్ ఎం పీ అభ్యర్ధి గడ్డం శ్రీనివాస్ యాదవ్, నాంపల్లి ఇంచార్జ్ ఆనంద్ కుమార్ గౌడ్, ఖైరతాబాద్ ఇంచార్జ్ మన్నే గోవర్ధన్, సీనియర్ నేతలు డాక్టర్ దసోజు శ్రవణ్, రావుల శ్రీధర్ రెడ్డి, విప్లవ కుమార్, తదితరులు పాల్గొన్నారు. బీ ఆర్ ఎస్ నేతలతో పాటు సికింద్రాబాద్, సనత్ నగర్, ముషీరాబాద్, జూబ్లి హిల్స్, నాంపల్లి, అంబర్ పేట్, ఖైరతాబాద్ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలతో కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సమావేశంలో తీగుల్ల పద్మారావు గౌడ్ ను భారీ ఆధిక్యతతో గెలిపించాలని వక్తలందరూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Related Posts

You cannot copy content of this page