మంత్రి జగదీశ్వర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించిన బిజెపి కార్యకర్తలు

Spread the love

అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలంటూ బిజెపి నాయకుల నినాదాలు

బిజెపి నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిజెపి బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు నేతృత్వంలో బిజెపి నాయకులు మరియు అర్హులైన లబ్ధిదారులతో కలిసి మంత్రి జగదీశ్వర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించడం జరిగింది.. క్యాంప్ ఆఫీస్ కు భారీగా బిజెపి కార్యకర్తలు చేరుకొని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నినాదాలు చేస్తుండడంతో పోలీసులు అరెస్టు చేసే క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా క్యాంప్ ఆఫీస్ కు చేరుకొని బిజెపి నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించడం జరిగింది…. మీడియాతో సంకినేని వరుణ్ రావు మాట్లాడుతూ

కామెంట్స్

1) 9 సంవత్సరాల మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాలనలో 900 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా కట్టించలేకపోయాడు

2) మంత్రి జగదీశ్వర్ రెడ్డి దత్తత గ్రామం ఏపూర్ లో మరియు చీదెళ్ళ గ్రామంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నిస్తున్న

3) కేసారం గ్రామంలో ఏడు సంవత్సరాల నుండి కడుతున్న డబుల్ బెడ్ రూమ్ లు నాసిరకంగా నాణ్యత లేకుండా చేస్తూ అవినీతి డబ్బులను కూడబెడుతున్నారు

4) ఇందిరమ్మ ఫేస్ త్రీ కాలనీలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎందుకు పంచడం లేదు……

కట్టిన ప్రతి ఇంటిని ఎన్నికల్లో పార్టీ మారిన వారికి మాత్రమే ఇచ్చేలా రాజకీయ లబ్ధి కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి జగదీశ్వర్ రెడ్డి వాడుకుంటున్నారు

సూర్యాపేట నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు వచ్చేంతవరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది

Related Posts

You cannot copy content of this page