ఎల్వర్తి, టంగుటూరు గ్రామాలలో బీజేపీ ఇంటింటి ప్రచారం

Spread the love

శంకర్‌పల్లి మండల పరిధిలోని ఎల్వర్తి, టంగుటూరు గ్రామాలలో బీజేపీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాములు గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. చేవెళ్లలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, దేశంలో మూడో సారి మోదీ ప్రభుత్వం రాబోతుందన్నారు. చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లని కోరారు. కార్యక్రమంలో ఎల్వర్తి బూత్ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బూత్ అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, మల్లేష్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page