భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ విడుదల చేసిన పత్రికా ప్రకటన.

Spread the love

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసే క్రమంలో భాగంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం వివరాలు..

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంటు ఎన్నికల ఇంచార్జ్, బెల్గాం శాసనసభ్యులు అభయ్ పటేల్ , బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షతన పార్టీ రాష్ర్ట ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా కార్యాచరణను అమలు చేసేలా చర్చ జరిగింది. ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ సెంట్రిక్ గా పని విభజన, నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి కార్యాచరణ రూపొందించడం జరిగింది. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటం చేసేలా కార్యక్రమాలను రూపొందింంచుకోవడంతో పాటు, ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహరచనపై విస్తృతంగా చర్చించారు. ఇంటింటికి వెళ్లి మోదీ ప్రభుత్వ విజయాలను తీసుకెళ్లే ప్రణాళికల రూపకల్పన జరిగింది.

ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , కాసం వెంకటేశ్వర్లు , తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page