బౌరంపేటలో భారతీయ జనతా పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Spread the love

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 1980 లో ప్రారంభం అయ్యి 2 ఎంపీ సీట్లతో నరేంద్ర మోడీ సారథ్యంలో మొదటి విడత 282, రెండోసారి 303 మూడోసారి సొంతంగా 370 NDA కు 400పైగా సీట్లకు చేరువలో నేడు 12కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనె అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించి, గత పది సంవత్సరాల నుండి ఉత్తమ పరిపాలనలో ప్రపంచంలో అగ్రదేశాల సరసన చేరి మూడవస్థానానికి చేరుకోవడం అన్నింటికీ మించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యంగా తీవ్రవాదులు మరియు పక్కనున్న శత్రు దేశాలు భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా దీటైన జవాబిస్తూ అత్యంత భద్రత కల్పిస్తూ,దేశాన్ని దేశప్రజల కాపాడుకుంటూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సంకల్పంతో వికసిత్ భారత్ నినాదంతో ముందుకు దూసుకుపోతున్నదని కొనియాడారు ఈ కార్యక్రమంలో గోనె మల్లారెడ్డి,నల్ల రాంచంద్రరెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి, సీతారాంరెడ్డి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం పోలింగ్ బూత్ అధ్యక్షులు పి మాధవరెడ్డి పార్టీ జండా ఆవిష్కరణ చేయడం జరిగింది వై జంగారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page