యర్రగొండపాలెంలో టిడిపి ఆధ్వర్యంలో హోరెత్తిన బీసీ నినాదం

Spread the love

యర్రగొండపాలెం పట్టణంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం అట్టహాసంహా జరిగింది. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు శ్రీ నూకసాని బాలాజీ , యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు , జిల్లా వాల్మీకి సాధికార సమితి కన్వీనర్ నల్లబోతుల రమాదేవిగారు పాల్గొన్నారు.

ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్, సర్దార్ గౌతు లచ్చన్న, మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేశారు, అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించారు.

జగన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీ లకు ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రతి ఒక్కరికి అన్యాయమే జరిగిందని తెలిపారు. చంద్రబాబు హయాంలోనే బీసీలకు న్యాయం చేకూరిందని తెలిపారు. బీసీలందరు చంద్రబాబు వెంటే ఉన్నారని, టిడిపి బీసీల పార్టీ అని అందరూ ఏకమై చంద్రబాబు ని ముఖ్యమంత్రిని చేయాలని ఎరిక్షన్ బాబు కోరారు…

కార్యక్రమంలో బీసీ నాయకులు, టిడిపి నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page