ఆటో యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఆటో యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అదే విధంగా బాచుపల్లి, దుండిగల్ మున్సిపాలిటీ, జీహెచ్ఎంసీ పరిధిలోని కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ళు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సైతం ఎమ్మెల్సీ ని కలిసి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేయగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెరాస శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page