జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ జడ్జి జడ శ్రావణ్ కుమార్ ని గౌరవప్రదంగా కలిసిన అట్లూరి విజయ్ కుమార్

Spread the love

దళితుల అభ్యుదయానికి పాటుపడుతున్న జై భీమ్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ ని తమ కార్యాలయంలో వినకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అట్లూరి విజయ్ కుమార్ గౌరవంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా అట్లూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉన్నతమైన న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉంటూ తమ పదవికి రాజీనామా చేసి దళితుల అభ్యుదయానికి జై భీమ్ పార్టీని స్థాపించి దళితుల పక్షాన ఒక గొంతికగా మాట్లాడుతూ దళితుల హక్కుల కోసం అహర్నిశలు శ్రమిస్తూ పార్టీలకతీతంగా పనిచేసేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి జడ శ్రావణ్ కుమార్ ని అన్నారు.

రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ ప్రజలకు అండగా ఉంటూ న్యాయపరమైన సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రంలో దళితులకు అండగా ఉంటూ ఆంధ్రప్రదేశ్లో మంచి న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్న జడా శ్రావణ్ కుమార్ కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అట్లూరి విజయ్ కుమార్ మంచి పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతేగాక రానున్న రోజుల్లో పార్టీలకతీతంగా దళితుల పక్షాన దళితులందరము ఏకమై పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బీసీ నాయకులు మాదాసు పృధ్విరాజ్ సాయి, ఎస్సీ నాయకుడు జంగాల బుజ్జి, రవి పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page