తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో భాగంగా సుదర్శన హోమం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా “తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం” సందర్భంగా తెలంగాణ దేవాదాయ – ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుదర్శన హోమం మరియు ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంత నిధులతో 250 మంది అర్చకులకు దుస్తులు ( పంచ, చీర ) పంపిణీ చేశారు. దూప దీప నైవేద్య పథకంలో భాగంగా రూ.6 వేల నుండి ప్రభుత్వం రూ.10 వేలకు పెంచిన నేపథ్యంలో నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతంకు చెందిన మూడు దేవాలయాలకు ఎమ్మెల్యే మంజూరు పత్రాలను అందజేశారు.

6 వేల నుండి 10 వేలకు పెంచినందుకు జీహెచ్ఎంసీ దూప దీప నైవేద్య అర్చక సంఘం సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వేద మంత్రాలతో అర్చకులు ఎమ్మెల్యే ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, అర్చకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page