హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలబ్ చెరువు సుందరీకరణలో భాగంగా రూ.1 కోటి 83 లక్షల రూపాయల అంచనా వ్యయం

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలబ్ చెరువు సుందరీకరణలో భాగంగా రూ.1 కోటి 83 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న అలుగు (తూము) నిర్మాణం, చెరువులో కలుషిత, వ్యర్థ జలాలు కలవకుండా మళ్లింపు పైప్ లైన్ నిర్మాణ పనులను ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ ఒకప్పుడు మురికి కూపం లాగా ఉన్న అలీ తలబ్ చెరువు కు మహర్దశ వచ్చినది అని, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో చెరువు సుందరికరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు చేపట్టడం జరిగినది అని, అదేవిధంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ, మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం, పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతున్నామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరీకరణ పనులు చేపడుతున్నాం అని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని చెరువు సుందరీకరణ మరియు అభివృద్ధి పనులు ప్రణాళిక తో, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈలు విశ్వం, రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి, కాలనీ వాసులు సురేష్ హరి, కోటేశ్వర రావు, సురేష్, విజయ్ కృష్ణ, రంజిత్, చంద్ర, శివ కుమార్, శివ, నవీన్, ప్రసాద్, చైతన్య, మూర్తి, నవీన్, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page