తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో భాగంగా శస్తర్ సాహెబ్ గురుద్వారాలో అర్ధాస్

Spread the love

“తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో భాగంగా శస్తర్ సాహెబ్ గురుద్వారాలో అర్ధాస్ ( ప్రత్యేక ప్రార్థన)లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


సాక్షిత :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ శస్తర్ సాహెబ్ గురుద్వారలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా “తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం” సందర్భంగా సిక్కు మతస్తులు ఏర్పాటు చేసిన అర్ధాస్ (ప్రత్యేక ప్రార్థన)లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవిస్తున్నదన్నారు. అర్ధాస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, సిక్కు మతస్తులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page