తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం

Spread the love

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం

అశ్వారావుపేట సాక్షిత న్యూస్ : తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేసినందుకు అశ్వారావుపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు కట్రం స్వామి దొర ఆధ్వర్యంలో అశ్వారావుపేట రింగ్ రోడ్ సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కట్రం స్వామి దొర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్రపూరిత వ్యవహరించి చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేశారని, గత రెండు రోజుల నుండి సిబిఐ, సిట్ వారు 2021 లో కేసు నమోదు చేయబడిందని నోటీసులు ఇస్తూ నిర్బంధించారని, కానీ 2021 కేసులో చంద్రబాబు నాయుడు పేరు లేదని, ఇప్పుడు కావాలని 37వ పేరుగా నమోదు చేశారని ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుందన్నారు.

అందుకే చంద్రబాబు నాయుడు కు మద్దతుగా నిరసనలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కట్రం స్వామి దొర తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నార్లపాటి శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి అంకోలు వెంకటేశ్వరరావు, ఊట్లపల్లి ఎంపీటీసీ రామకృష్ణ, అంజిబాబు,బొడ్డపాటి రమాదేవి, బొడ్డుపాటి ఉదయ్, నార్లపాటి సురేష్, నార్లపాటి బన్ను, సాయిల వెంకటేశ్వర్లు, కుంజ బుచ్చిరాజు, సడియం రాజు, మడకం అంజి, మారపాక శ్రీను, నార్లపాటి అంజి, నర్రా రాకేష్, కలపాల తాత తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page