SAKSHITHA NEWS

శ్రీ కృష్ణాష్టమి పర్వదినంను పురస్కరించుకుని హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని మదినగూడా లో గల శ్రీ కృష్ణ దేవాలయంలో జరిగిన శ్రీ కృష్ణ పరమాత్మ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఈ భుమి మీద అవతరించిన అవతార పురుషుడు శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాలా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు జనార్దన్, బాబు మోహన్ మల్లేష్,మల్లేష్ యాదవ్, హరి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS