గంగినేని సొసైటీ చైర్ పర్సన్ గా అన్నంశెట్టి వెంకట్రావు

Spread the love

నియామకపు ఉత్తర్వులు అందజేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా,

జి.కొండూరు మండలం గంగినేని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పి.ఏ.సి.ఎస్) చైర్ పర్సన్ గా గంగినేని గ్రామానికి చెందిన అన్నంశెట్టి వెంకట్రావు నియమితులయ్యారు. ఈ మేరకు నియామకపు ఉత్తర్వులను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వారికి అందజేశారు. డైరెక్టర్లుగా దుగ్గిరాలపాడుకు చెందిన వల్లేటి నరసింహారావు , తెల్లదేవరపాడుకు చెందిన సంకా సహదేవుడు నియమితులయ్యారు.

శాసనసభ్యులు కృష్ణప్రసాదు వారిని ప్రత్యేకంగా అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ్యులు కృష్ణప్రసాదు నాయకత్వంలో సీఎం జగనన్న స్ఫూర్తితో రైతులకు విస్తృతంగా సేవలను అందిస్తామని వెల్లడించారు. సొసైటీ సెక్రటరీ యడ్లపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page