కాకాణి కి అండ – వరిగొండ”

Spread the love

వరిగొండ లో మంత్రి కాకాణి ప్రచారం”

“సర్వేపల్లి లో జనం హోరు – ఫ్యాన్ జోరు”

“మంత్రి కాకాణి ఎన్నికల ప్రచార యాత్రకు భారీ స్పందన”

“సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, వరిగొండ గ్రామంలో ఎన్నికల ప్రచారం కొనసాగించిన మంత్రి కాకాణి”

“మంత్రి కాకాణి కి అడుగడుగునా జననీరాజనం”

“అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడంతో అంగరంగ వైభవంగా కొనసాగిన మంత్రి కాకాణి ప్రచార యాత్ర”మంత్రి కాకాణి వెంట ప్రచారంలో మహిళలు, రైతులు స్వచ్ఛందంగా పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు”మంత్రి కాకాణి వెంట నడిచిన ప్రతి వాడ, ప్రతి గడపకు చెందిన స్థానిక ప్రజలు”

“బ్యాండ్ మేళాలు, మహిళల మంగళహారతులు, డప్పు వాయిద్యాలు, తప్పెట్లు, భారీ పూలమాలలతో అట్టహాసంగా కొనసాగిన మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం”గ్రామాలలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించిన మంత్రి కాకాణి కే తమ ఓటు అంటున్న సర్వేపల్లి ప్రజలు”సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి ని 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధం అంటున్న సర్వేపల్లి ప్రజలు”

“మంత్రి కాకాణి ని పలు సభలలో, 2014 ఎన్నికలలో చంద్రబాబు ఇచ్చిన హామీలను ఆ తరువాత అధికారంలోకి వచ్చి మోసగించిన తీరును ఆయన వాయిస్ ద్వారానే ప్రజలకు వినిపించి చైతన్య పరచడం జరిగింది”చంద్రబాబు హామీలు ఇచ్చి మోసం చేసిన వైనాన్ని మంత్రి కాకాణి ఆడియో ద్వారా వినిపించినప్పుడు చంద్రబాబు మోసగాడు, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించడం విశేషం”సోమిరెడ్డి గెలుస్తున్నట్లు పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేసిన మంత్రి కాకాణి”30 వేల తో గెలుస్తానని ఉత్తర ప్రగల్బాలు పలుకుతున్న సోమిరెడ్డి పార్టీ అధినేత చంద్రబాబు వస్తేనే కనీసం 3,000 మందిని కూడా తరలించలేకపోయాడని విమర్శించిన మంత్రి కాకాణి”

“సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి పరపతి పూర్తిస్థాయిలో క్షీణించిపోయిందని పేర్కొన్న మంత్రి కాకాణి”పొదలకూరులో జనం లేరని తెలిసి చంద్రబాబు నాయుడు రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా.. డాంబికాలు చెప్పే సోమిరెడ్డి పట్టుమని వేయి మందిని సభకు తీసుకురాలేకపోయాడని వ్యంగంగా వ్యాఖ్యానించిన మంత్రి కాకాణి”సోమిరెడ్డి ముసలి కన్నీరు కార్చుకుంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నాడని విమర్శించిన మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తూ ఓట్ల కోసం తిరుగుతున్నాడని.. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సోమిరెడ్డి ఎక్కడికి వెళ్లాడని ప్రశ్నించిన మంత్రి కాకాణి”కరోనా సమయంలో సోమిరెడ్డి ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి తన ప్రాణాలను కాపాడుకునే హైదరాబాద్, బెంగుళూరుకు వెళ్లి దాక్కున్నాడని విమర్శించిన మంత్రి కాకాణి”కరోనా సమయంలో ప్రతి ఇంటికి బియ్యం ఇతర నిత్యవసర వస్తువులను అందజేసి వారిని ఆదుకున్నామని గుర్తు చేసిన మంత్రి కాకాణి”కరోనా సమయంలో ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ కు అదనంగా 3 కోట్ల రూపాయలు విలువైన బియ్యం, వంట నూనె పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి కాకాణి”

“కరోనా సమయంలో మృత్యువును సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం నిలబడ్డామని తెలిపిన మంత్రి కాకాణి”సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతుంటే దీనిపై పోరాటం చేసి.. నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి ఉండేలా పోరాటం చేసిన చరిత్ర తమదని పేర్కొన్న మంత్రి కాకాణి”సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు పుట్టి ధర 18,300 ఉంటే రైతులు 12 వేలు లేదా 13 వేలకు తమ ధాన్యాన్ని తెగనమ్ముకుని తీవ్రంగా నష్టపోయారు అన్న మంత్రి కాకాణి””రైస్ మిల్లర్ ల వద్ద సోమిరెడ్డి 50 కోట్ల రూపాయలు చందాలు దండుకోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారన్న మంత్రి కాకాణి”

“తాను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దళారులను దరి చేరనివ్వలేదన్న మంత్రి కాకాణి”రైతులకు నిర్దేశించిన గిట్టుబాటు ధర కంటే 30% అధికంగా 22 వేల నుంచి 24 వేల రూపాయలు వచ్చేలా కృషిచేసి రైతులకు మేలు చేకూర్చామన్న మంత్రి కాకాణి””సోమిరెడ్డి నీరు చెట్టు, రైతు రథం పేరిట అవినీతికి పాల్పడడం, రైతులను అడ్డుపెట్టుకొని దోచుకోవడం తప్ప సర్వేపల్లి అభివృద్ధికి కృషి చేసిందేమీ లేదు”తోటపల్లి గూడూరులో తెలుగుదేశం పార్టీ హయాంలో సాగునీరు ఇచ్చేందుకు ఎకరాకు 1000 రూపాయలు రైతులు దగ్గర వసూలు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు పంచుకున్నారని, వైకాపా ప్రభుత్వం ఏర్పడిన ఈ ఐదేళ్లలో ఒక్క రైతు దగ్గర నుండి ఒక్క రూపాయి వసూలు చేయకుండానే సమృద్ధిగా, సంపూర్ణంగా సాగునీరు అందించామన్న మంత్రి కాకాణి”

“కోర్టులో ఫైల్ల దొంగతనానికి సంబంధించి సిబిఐ విచారణ జరుగుతున్న దగ్గర నుంచి సోమిరెడ్డి తనపై అవాస్తవ ప్రచారం చేశాడన్న మంత్రి కాకాణి”సిబిఐ పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఈ దొంగతనానికి సంబంధించి తనకు ఎలాంటి ప్రమేయం లేదని క్లీన్ చిట్ ఇచ్చిందన్న మంత్రి కాకాణి”సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వగానే సోమిరెడ్డి ఊరు మూత పడిందన్న మంత్రి కాకాణి”

“కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసేందుకు సోమిరెడ్డి తిరుగుతున్నాడని, అలాంటి వ్యక్తి మాటలను నమ్మవద్దన్న మంత్రి కాకాణి”అర్హత కలిగిన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందని పేర్కొన్న మంత్రి కాకాణి”ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏ ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేశాయో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓట్లు వేయాలని కోరిన మంత్రి కాకాణి”

“ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరితేనే ఓటు వేయమని ధైర్యంగా అడగగలిగిన ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పిన మంత్రి కాకాణి””ప్రతినెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లను అందించే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న మంత్రి కాకాణి””ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన పార్టీలు కూటమికట్టి వస్తున్నాయన్న మంత్రి కాకాణి”

“2014 ఎన్నికల సమయంలో కూడా ఈ మూడు పార్టీలు కూటమిగా వచ్చాయన్న మంత్రి కాకాణి”మోసం చేయడమే చంద్రబాబు పని అని.. 2014 ఎన్నికల సమయంలో 607 హామీలు ఇచ్చి కనీసం 6 హామీలను కూడా అమలు చేయలేదని విమర్శించిన మంత్రి కాకాణి”2014 ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నిస్తారన్న భయంతో చివరికి ఎన్నికల మేనిఫెస్టో ను కూడా ఆన్లైన్ నుంచి మాయం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదన్న మంత్రి కాకాణి”

“రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పి చంద్రబాబు మోసం చేశాడన్న మంత్రి కాకాణి””ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను, ఆ తర్వాత వాటిని తప్పి ఆయన మాట్లాడిన మాటలను ప్రజలకు వినిపించిన మంత్రి కాకాణి”2014 ఎన్నికలలో ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే ప్రజలను కూటమి నేతలు నిండా మోసం చేశారన్న మంత్రి కాకాణి”

“2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని గుర్తుచేసిన మంత్రి కాకాణి”చంద్రబాబు డ్వాక్రా రుణాలకు సంబంధించి మాట తప్పితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగు విడతల్లో డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేసి మాట నిలబెట్టుకున్న వ్యక్తి అని ప్రశంసించిన మంత్రి కాకాణి”చంద్రబాబు, కరువు రెండు కవల పిల్లలని, చంద్రబాబు హయంలో నిత్యం కరువు తాండవించిందని విమర్శించిన మంత్రి కాకాణి”ఎన్నికల్లో హామీలు ఇచ్చి మోసం చేసే చంద్రబాబు కావాలా.. చెప్పిన దానికన్నా ఎక్కువగా ప్రజలకు సేవ చేసే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కావాలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరిన మంత్రి కాకాణి”

“తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు ..పశ్చిమాన సూర్యుడు అస్తమిస్తాడన్నది ఎంత వాస్తవమో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి ఖాయమని పేర్కొన్న మంత్రి కాకాణి”మీ ఇంటి బిడ్డగా గత ఐదు సంవత్సరాలుగా సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేశానని.. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి “

Related Posts

You cannot copy content of this page