శంకర్‌పల్లి వీధి వ్యాపారస్తులకు ముఖ్య గమనిక: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

Spread the love

శంకర్‌పల్లి: మార్చి 31: ( సాక్షిత న్యూస్): నేటి నుండి వీధి వ్యాపారస్తులు చెల్లించవలసిన తై బజార్ ఫీజును మున్సిపాల్టీకి చెల్లించాలని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ తై బజార్ ఫీజు తీసుకునే కాంట్రాక్టర్ గడువు మార్చి 31 ఆదివారంతో ముగిసిందన్నారు. వీధి వ్యాపారస్తులందరూ కాంట్రాక్టర్ కు ఫీజు చెల్లించవద్దని కోరారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి మున్సిపల్ సిబ్బంది వారిచే తై బజార్ ఫీజు వసూలు చేయబడునని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రతిపాదనలు కలెక్టర్ కు పంపామని, కలెక్టర్ కార్యాలయం నుండి ఆదేశాలు వచ్చే వరకు మున్సిపల్ సిబ్బంది తై బజార్ ఫీజు వసూలు చేయబడునని తెలిపారు. ఈ విషయాన్ని వీధి వ్యాపారస్తులందరూ గ్రహించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు.

Related Posts

You cannot copy content of this page