అన్ని స్థానాలు గెలుస్తాం..

Spread the love

అన్ని స్థానాలు గెలుస్తాం..

  • విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

……..

సాక్షిత, తిరుపతి బ్యూరో:
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అన్ని స్థానాల్లో గెలుస్తాం అని, వైసీపీలో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి నివాసంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కుప్పంలో పర్యటించిన 15 రోజులు బ్లాక్ డేనే…. నీతి మాలిన రాజకీయ నాయకుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత మానసిక పరిస్థితి బాగా లేదని, చంద్రబాబును వెంటనే కుటుంబ సభ్యులు వైద్యుడికి చూపించాలని కోరారు. నిబద్ధత లేని చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గెలిపించరని’ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఎమ్మెల్యేగా కుప్పం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం చంద్రబాబుకు తెలియదా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఈ మూడేళ్ళలో కుప్పంకు కేవలం 6 సార్లు మాత్రమే చంద్రబాబు వచ్చారని, 30 సంవత్సరాల్లో కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్థి శూన్యం అన్నారు. కుప్పంలో పెండింగ్ లో ఉన్న తాగు, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. కుప్పంలో చంద్రబాబు పేదల కోసం కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదని విమర్శించారు.
చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే 7 వేల ఇళ్లను నిర్మించి ఇచ్చిందని, త్వరలో మరో 3 వేల ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా కుప్పంలో ఒక్కరికైనా ఇల్లు కట్టించి ఇచ్చారా..? అని చంద్రబాబును మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. బ్యానర్లు చించి, రాళ్ళతో వైసీపీ కార్యకర్తలను కొట్టారు. నారా లోకేష్ మంగళగిరిలోనే ఘోరంగా ఓడిపోయారు. కుమారుడు లోకేష్‌ను గెలిపించుకోలేని వ్యక్తి చంద్రబాబు.. తన హోదాను తానే దిగజార్చుకుంటున్నారని చెప్పారు. ఇకనైనా ఏపీ ప్రభుత్వ పనులను అడ్డుకోవడం మానివేయాలని, కుప్పంలోనూ ఉన్న పేరు పోతుందంటూ హెచ్చరించారు.

Related Posts

You cannot copy content of this page