20 సంవత్సరాల తర్వాత గ్రామస్తుల కల నెరవేర్చిన ఎమ్మెల్యే నంబూరు

Spread the love

20 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చెలించిపోయిన పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు వెంటనే బెల్లంకొండ, కొత్తపాలెం గ్రామాల మధ్య 5 కిలోమీటర్ల తారు రోడ్డును 1 కోటి 2 లక్షల రూపాయలతో నిర్మించారు. కొత్తపాలెం గ్రామప్రజలు గత 20 సంవత్సరాల క్రితం రోడ్డును వేశారని తరువాత ఈ రోడ్డు గురించి ఎవరూ పట్టించుకోలేదని, మోకాళ్ళలోతు గుంతలతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని అడిగిన వెంటనే నాబార్డ్(NIDA) నిధులను మంజూరు చేయించి వెంటనే ఈ రోడ్డును పూర్తి చేశారు.

నూతనంగా వేసిన ఈ రోడ్డు వల్ల తమ కష్టాలు తొలగాయని, ఆనందం వ్యక్తం చేస్తూ అడిగిన వెంటనే రోడ్డును నిర్మించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కి కొత్తపాలెం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తయిన రోడ్డును పరిశీలించటానికి వచ్చిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారిని కొత్తపాలెం, బెల్లంకొండ గ్రామాల ప్రజలు కలిసి తమ ఆనందాన్ని తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page