ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ కర్నాటి

Spread the love

ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ కర్నాటి

అశ్వారావుపేట సాక్షిత న్యూస్ : స్థానిక ప్రభుత్వ వైద్యశాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల సమావేశం నిమిత్తం అశ్వారావుపేట వచ్చిన కర్ణాటి వెంకటేశ్వరరావు ప్రభుత్వ వైద్యశాలలో అందిస్తున్న సేవలను తనిఖీ చేశారు. నూతనంగా ఏర్పాటుచేసిన డయాలసిస్ వార్డును పరిశీలించి పేషెంట్లను బాగోగులు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ లోని డాక్టర్లను కలిసి రోగులకు అందిస్తున్న సేవలు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఎక్స్ రే పనిచేయడం లేదని, నాణ్యమైన పనిముట్లను అందించాలని వైద్యులు కోరగా పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వరరావు వెంట డాక్టర్ పూర్ణచంద్, హెడ్ నర్స్ ప్రమీల హాస్పటల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page