భాను ప్రకాష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి

Spread the love

భాను ప్రకాష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి

ప్రకాశం జిల్లా కొమరోలులో ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి పై అసభ్యజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమరోలుకు చెందిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గిద్దలూరు భారతీయ జనతా పార్టీ నాయకులు కొమరోలు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సుబ్బరాజుకు లికిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.తిరుమలకు ఇటీవల దైవ దర్శనానికి వెళ్లిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు టీటీడీ ఈవో పై విమర్శలు గుప్పించడంపై భాను ప్రకాష్ రెడ్డి అభ్యంతర వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబును బహిరంగంగా భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ అసభ్య వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో పార్టీ పేరుతో కించపరుస్తూ మెసేజ్లు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోకపోతే నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. తర్వాత కొమరోలు ఎస్ఐ సుబ్బరాజుకు వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ బిజెపి అధ్యక్షుడు బి.వి రామాంజనేయులు, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి గుమ్మా రాములు, గిద్దలూరు పట్టణ ఉపాధ్యక్షుడు ముప్పురి శ్రీనివాసులు,గిద్దలూరు రూరల్ కాకునూరి తిరుపాల్ రెడ్డి, ఓ.బి.సి నియోజకవర్గ ఇన్చార్జి డి. బాదుల్లా, నియోజకవర్గ కన్వీనర్ పళ్లెం శ్రీనివాసులు, ఓబీసీ టౌన్ అధ్యక్షుడు ఓదెళ్ల శ్రీనివాసులు, నియోజకవర్గ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇంచార్జ్ కమలపాటి చంద్రమోహన్, కొమరోలు మండల అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, ఉపాధ్యక్షుడు పాండు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page