మృత్యుంజయ స్వామి అభిషేకం

Spread the love

Abhishekam of Mrityunjaya Swami

మృత్యుంజయ స్వామి అభిషేకం

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న మృత్యుంజయ స్వామి వారికి అభిషేకం వైభవంగా నిర్వహించారు.

ముందుగా విఘ్నేశ్వర స్వామి కి పలురకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు.

అనంతరం మృత్యుంజయ స్వామి వారికి పాలు, పంచామృతం, చందనం, విభూది, పచ్చ కర్పూర లతో మృత్యుంజయ సామి వారికి వైభవంగా అభిషేకం నిర్వహించారు.

అనంతరం పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలు, గజమాలలు, వెండి నాగాభరణం తో మృత్యుంజయ స్వామివారిని శోభమయంగా అలంకరించి. దూప, దీప నైవేద్యాలు మహా మంగళ హారతులు సమర్పించారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ ప్రాంగణమంతా హర.. హర.. మహాదేవ శంభో… శంకర ఓం నమశ్శివాయ… నామస్మరణతో తో మారుమోగింది.

Related Posts

You cannot copy content of this page