తిరుమల కుంట గ్రామంలో టిడిపి కార్యకర్తల సమావేశం

Spread the love

సాక్షిత న్యూస్…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

అశ్వారావుపేట మండలం

తిరుమల కుంట గ్రామంలో టిడిపి కార్యకర్తల సమావేశం

తిరుమల కుంట గ్రామపంచాయతీలో గల తిరుమల కుంట కాలనీ వద్ద తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు పర్స రమేష్ మరియు మడకం అంజి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి అయిన కట్రం స్వామి దొర ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశంలో అశ్వరావుపేట నియోజకవర్గం ఇంచార్జ్ మాట్లాడుతూ గతంలో జరిగిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనుల గురించి మాట్లాడడం జరిగింది అలాగే బి ఆర్ ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్స్ ఇల్లు ఇప్పటివరకు లబ్ధిదారులకు అందజేయలేదు.

ఈ కారణంగా లబ్ధిదారులు తమకు రావలసిన ఇళ్లను త్వరగా ఇప్పించాలని అధికారుల మీద ఒత్తిడి తేవాలని అశ్వరావుపేట నియోజకవర్గంఇన్చార్జి అయిన కట్రం స్వామి దొర తో గోడు విన్నవించుకున్నారు అలాగే తిరుమల కుంట కాలనీ గ్రామానికి చెందిన వికళంగురాలు అయిన మొడియం కళావతి కి పెన్షన్ కార్డు ఉన్న ప్రభుత్వ నుండి ఎలాంటి రుసుము అందలేదు ఈ విషయంలో కూడా నేను అధికారులతో మాట్లాడతానని చెప్పి వారి దగ్గర నుండి ఆధారాలు తీసుకొని పై అధికారులతో మాట్లాడి పెన్షన్ వచ్చేటట్టు చేస్తానని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నార్లపాటి శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి అంకోలు వెంకటేశ్వరరావు, ఉట్లపల్లి ఎంపీటీసీ రామకృష్ణ, తుమ్మల నాగేశ్వరరావు, ఉప్పల బ్రహ్మేంద్ర, మాడ శ్రీను, డాబా రామదాస్ మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తలు శ్రేయోభిలాషులు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆడపడుచులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

Related Posts

You cannot copy content of this page