నాని ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు

Spread the love

చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎచ్చెర్ల యువనాయకులు నాని ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం సుభద్రపురం జంక్షన్ నుండి వెంకటాపురం వరకు వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కంది నాని ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం గౌరవంగా తలెత్తుకుని జీవించేలా అందరికీ ఇల్లు అందించే కార్యక్రమం చేపట్టింది.రాజధాని ప్రాంతంలోని నిరుపేదలకు అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసింది.అయితే టీడీపీ అధినేత చంద్రబాబు పేదల ఇళ్ల స్థలాలను శ్మశాన వాటికలతో పోల్చి పేదలను దారుణంగా అవమానించారు.టీడీపీ దుర్మార్గపు వైఖరిని నిరసిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కంది నాని మాట్లాడుతూ ఎన్నికల సమీపిస్తున్న కొద్ది చంద్రబాబు నాయుడు సరికొత్త డ్రామాలతో,గారడి మాటలతో ప్రజల ముందుకు వస్తున్నారు.ఉచితంగా సంక్షేమ పథకాలు ఇస్తే ప్రజలు సోమరిపోతులవుతారని,పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న చంద్రబాబు నాయుడు రేపు అధికారంలోకి రాగానే అవే సంక్షేమ పథకాలు అమలు చేస్తాననడం ఆయన ద్వంద వైఖరికి,మోసపు మాటలకు నిదర్శనమని అన్నారు.మహానాడులో పథకాల పేరుతో సరికొత్త డ్రామాలకు తెరలేపారని కంది నాని అన్నారు.ఈ కార్యక్రమంలో లావేరు మండలం సర్పంచ్లు,ఎంపీటీసీలు,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తదితరులు మద్దతుగా పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page