SAKSHITHA NEWS

బౌరంపేట్ లో ముదిరాజ్ సంఘం భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ లో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ సంఘం భవనాన్ని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంఘం సభ్యులు, అధికారులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS