ముస్లిం స్మశాన వాటిక స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ….

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్, సోనియా గాంధీ నగర్ లో గల ముస్లిం సోదరుల స్మశాన వాటిక స్థలంపై నెలకొన్న సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ స్థానికులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు,అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం వాడుకలో ఉన్న ముస్లిం స్మశాన వాటిక స్థలం అటవీశాఖతో ఉన్న సమస్యను కలెక్టర్ మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, జనరల్ సెక్రటరీ సిద్ధిక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, మఖ్సూద్ అలీ, బషీరుద్దీన్, దొడ్ల ఆంజనేయులు,ఖలీల్, ఇర్ఫాన్, అక్బర్, షహనాజ్, నగేష్, ఆర్షియా, ఖాసీం బీ, రాణి,స్థానికులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page