GHMC కమిషనర్  రోనాల్డ్ రాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన పలు అభివృద్ధి పనుల పై చర్చించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ .

Spread the love

సాక్షిత ; GHMC ప్రధాన కార్యాలయంలో  GHMC కమిషనర్  రోనాల్డ్ రాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన పలు అభివృద్ధి పనుల పై చర్చించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా లింగంపల్లి అండర్ బ్రిడ్జి వద్ద రూ. 4 కోట్ల రూపాయల తో చేపట్టబోయే నాల నిర్మాణం పనులు త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బ తిన్న రోడ్ల పునరుద్ధరణ కై నిధులు మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చూడలని,మట్టి రోడ్ల ఉన్న ప్రాంతాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, అభివృద్ధి పనులలో వేగం పెంచేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ,అసంపూర్తి గా మిగిలిపోయిన నాలల విస్తరణ పనులలో వేగం పెంచాలని GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ గారిని ప్రభుత్వ విప్ గాంధీ కొరినారు.

దీనికి వెంటనే స్పందించిన కమిషనర్ శ్రీ రోనాల్డ్ రాస్ సానుకూలంగా స్పందించడం జరిగినది.త్వరలోనే లింగంపల్లి అండర్ బ్రిడ్జి వద్ద నాల విస్తరణ పనులు చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలియచేసారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్ల ను పూర్తి చేస్తామని తెలియచేశారు

Related Posts

You cannot copy content of this page