SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ప్రసూన నగర్ సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఫెడరేషన్ అఫ్ సీనియర్ సిటిజన్స్ అర్గోనిసాటిన్స్ సభ్యులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి టిస్ఆర్టిసి బస్సు సర్వీస్ టికెట్ లపై అదనపు రాయితీ కల్పించవలసిందిగా సహకరించాలని వినతి పత్రం అందచేశారు, అలాగే సీనియర్ సిటిజన్స్ నివాసం ఉంటున్న ప్రాంతాలలో మొబైల్ హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయవలసిందిగా ఎమ్మెల్యే కి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన వద్దకు వచ్చిన ఈ సమస్యని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి సరైన న్యాయం చేకూరేలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జి నాగేశ్వర్ రావు, విద్య సాగర్ రెడ్డి, ఎస్ నాగేశ్వర్, జి.స్.నారాయణ రావు, డి.జి.ఎస్.రమేష్, రాంచందర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS