SAKSHITHA NEWS

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని దత్తత్రయ కాలనీ ఫేస్ 2లో పది లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డు మీద నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో సీసీ రోడ్డు నిర్మించాలని సంబంధిత అధికారులకు మరియు కాంట్రాక్టర్ కు తెలియచేసారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెట్టి కాలనీని సుందరంగా తీర్చిదిద్దుకోవాలని కాలనీ ప్రజలకు సూచించారు.

ర్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్ మరియు చిన్నోళ్ల శ్రీనివాస్, కాలనీ వాసులు వి.జగదీష్, బి.శంకర్ గౌడ్, బి.నిరంజన్ గౌడ్, కె.అశోక్, శ్రీనివాస్, రామకృష్ణ, మధుసూదన్ రెడ్డి, రామచంద్రుడు, బిఎస్ఆర్ కాంత్, AE శ్రావణి, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS