ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో నిన్నటి నుండి కురుస్తున్న వర్షం కారణంగా రోడ్డు పై ప్రవహిస్తున్న వర్షo

Spread the love

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో నిన్నటి నుండి కురుస్తున్న వర్షం కారణంగా రోడ్డు పై ప్రవహిస్తున్న వర్షపు నీటిని గమనించి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా సంబంధిత అధికారులను అదేశించి వర్షపు నీటిని వెంటనే క్లియర్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో వర్షపు ఎక్కడ నిలిచిన వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే వర్షాకాలం కారణంగా డివిజన్ ప్రజలందరు వారి ఇండ్లను మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని అనారోగ్యాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కరెంట్ స్తంభాలను తాకకుండా ఉండాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు కరెంట్ స్తంబాల వద్దకు పోకుండా తల్లితండ్రులు జాగ్రత్త వహించాలి సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, సాయి గౌడ్, పద్మయ్య, రాజన్న, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page