SAKSHITHA NEWS

నాగర్‌కర్నూల్‌లో జూపల్లి రోడ్‌షో.. భారీ కాన్వాయ్‌తో ర్యాలీ

సాక్షిత నాగర్‌కర్నూలు:
జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రోడ్‌ షో నిర్వహించారు. భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 20 న జరిగే బహిరంగ సభాస్థలి పరిశీలన కోసం వచ్చినట్టు తెలిసింది ఈ సందర్భంగా జూపల్లి మీడియాతో మాట్లాడుతూ… ఈనెల 20 న కొల్లాపూర్‌లో రెండు లక్షల మందితో పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు ప్రముఖ నాయకులు, ప్రియాంక గాంధీ రానున్నట్లు చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి, రాక్షస, నియంతృత్వ పాలనకు చమర గీతం పాడాలన్నారు. ఆస్తులు.. పుస్తెలు అమ్ముకొని చదువుకున్న వారు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని.. తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్‌కు బహుమానం ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ సీఎం అయ్యే వారా అంటూ జూపల్లి కృష్ణరావు ప్రశ్నించారు…


SAKSHITHA NEWS