SAKSHITHA NEWS

ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం నుండి బైక్ ర్యాలీగా యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు యువ పోరాట యాత్ర బస్సు యాత్ర ను విజయవంతం చేయడానికి సజ్జద్ మహమ్మద్ యూత్ కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా వెళ్లి వారికి ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి , కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి , యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గార్లకు ఇమామి జామీన్ కుడి చేతికి కట్టి ఘన స్వాగతం పలికారు.

ఈ బస్సు యాత్ర తెలంగాణ రాష్ట్రంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతపై చేస్తున్న ఆగడాలను ఎండగట్టడం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువత ఏ విధంగా పాటుపడ్డారో వారికి అన్యాయం జరిగిందని నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపడం కోసం తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర మొత్తం ఈ బస్సు యాత్ర చేయడం జరుగుతోంది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో అని యువతకు తెలియజేసే విధంగా ఈ బస్సు యాత్ర ముందుకు సాగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు హుజరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సజ్జద్ మహమ్మద్ , దౌలత్, తల్లపల్లి తిరుమలేష్ , వెంకటేష్ , సల్లు బాబా , ప్రసాద్ , హరీష్ రెడ్డి , సూరి , రేవంత్ రఫీ , జొన్నల మహేష్ , మోహన్ రెడ్డి , సుమన్ , శశి ప్రియతమ్ , అనిల్ ,తదితరులు స్వాగతం పలికారు.


SAKSHITHA NEWS