SAKSHITHA NEWS

“ప్రగతి యాత్ర”లో భాగంగా 83వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

రంగారెడ్డి నగర్ డివిజన్ సుమిత్ర నగర్, గుడెన్మెట్ కాలనీల్లో స్థానిక కార్పొరేటర్ తో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 83వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా సుమిత్ర నగర్, గుడెన్మెట్ కాలనీల్లో స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ తో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న పనులను తెలుసుకున్నారు. కాగా గడిచిన ఏళ్లలో కాలనీల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేసినందుకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మిగిలి ఉన్న డ్రైనేజీ, సీసీ రోడ్లు, కరెంటు పోల్స్ బదిలీ వంటి పనులను పూర్తి చేసేలా సహకారం అందించాలని ఎమ్మెల్యే ని కోరగా.. అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. వాటిని త్వరలోనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక డివిజన్ అధ్యక్షుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS