SAKSHITHA NEWS

కలిశెట్టి ఆధ్వర్యంలో 100 ఎడ్లబళ్లుతో భారీ ర్యాలీ

ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలోని లావేరు,మండలంలో ఆదివారం సాయంత్రం ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో లక్ష్మీపురం,నేతేరు, లోపెంట, కేశవరాయునిపాలెం,గ్రామాల రైతుల ఆధ్వర్యంలో సుమారు100ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా కలిశెట్టి మాట్లాడుతూ.టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇటీవల మహానాడులో అన్నదాత పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000లు ఆర్థిక సాయం ప్రకటించిన సందర్భంగా ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు.రైతులు సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు.రానున్న ఎన్నికల్లో చంద్రబాబునాయుడును సీఎం చేసేందుకు మద్దతుగా సుమారు 2000 రైతులతో ఈ ర్యాలీలో పాల్గొని, తమ అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు.ర్యాలీలో నాలుగు మండలాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS