SAKSHITHA NEWS

సాక్షిత : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పెద్దమ్మ గూడెం గ్రామంలో గత రెండు రోజుల నుండి బొడ్రాయి లింగమయ్య, ఊరడమ్మ, గాలి పోచమ్మ విగ్రహాల ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, పాడిపశువు బాగుండాలని, పంటలు బాగా పండాలని,సంపద పెరగాలని ఆ భగవంతున్ని కోరారు.


ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కే ప్రభాకర్, రాష్ట్ర నాయకులు ఎంపిటిసి సభ్యులు జి. వెంకటేశం గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ సంజీవ, వార్డు సభ్యులు , ఇతర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు ,డైరెక్టర్లు మరియు నాయకులు యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS