SAKSHITHA NEWS

చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు కు నిరసనగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్

పేదల ఇళ్ల స్థలాలపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలోని స్థానిక రామతీర్థం జంక్షన్ నుంచి బైపాస్ వరకు చేపట్టిన బైక్ ర్యాలీను ఎమ్మెల్యే ప్రారంభించారు.సుమారు 500 బైక్ లతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు.పేదలను కించపరిచేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ ర్యాలీలో వైయస్సార్ నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS