SAKSHITHA NEWS

ప్రగతి యాత్ర‘లో భాగంగా 66వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ డివిజన్ వాజ్ పాయ్ నగర్ లో పాదయాత్ర…
బస్తీ అభివృద్ధికి సహకారం అందించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు…

*సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని వాజ్ పాయ్ నగర్ లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 66వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తిచేసిన సీసీ రోడ్లు పరిశీలించారు. కాగా తమ బస్తీ అభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించినందుకు ఎమ్మెల్యే కి ప్రజలు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మిగిలిన భూగర్భడ్రైనేజీ, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ని కోరారు. దీంతో ఎమ్మెల్యే అక్కడే ఉన్న అధికారులకు ఆదేశించారు. త్వరలోనే వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఈ పాపమ్మ, మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, నార్లకంటి బాలయ్య, భాస్కర్ రాజు, ఉమేష్, యాదగిరి, జయంచారి, జలిగం రాకేష్, నజీర్, బ్రిజేష్, వెంకట రమణి, జానకి, లక్ష్మీ, ప్రభాకర్, రాజు, వెంకటేష్, శ్రీనివాస్, దినేష్, మధుకర్ రెడ్డి, భగవాన్ రెడ్డి, అజయ్, వెంకటేష్, మల్లేష్, బ్రహ్మం, భాస్కర్, సాంబయ్య, అర్జున్, లక్ష్మీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS