తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్యరంగం ఎంతో అభివృద్ధి సాధించిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య భవన్ లో జరిగిన మత్స్య సహకార సొసైటీల చైర్మన్ గా పిట్టల రవీందర్ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రవీందర్ కు మంత్రి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వివిధ కులవృత్తుల పై ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబాలలో వెలుగులు నింపాలి, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి లక్ష్యం అన్నారు. అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా కోట్లాది రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత మత్స్యకారులు నాటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పూడిపోయి, పిచ్చిమొక్కలతో నిండిన చెరువులు మిషన్ కాకతీయ అనే ఒక గొప్ప కార్యక్రమం ద్వారా పునరుద్దరణ, నూతన రిజర్వాయర్ ల నిర్మాణంతో నిరంతరం చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. గతంలో చెరువులపై దళారుల పెత్తనం ఉండేదని, మత్స్యకారులకు మేలు చేయాలనే ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు పంచాయితీ రాజ్ పరిధిలో ఉన్న చెరువులను కూడా మత్స్య శాఖ పరిధిలోకి బదిలీ చేసి సర్వహక్కులు మత్స్యకారులకు అప్పగించినట్లు వివరించారు. చేపలను తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని మంత్రి సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద ఎవరు ఊహించని రీతిలో పెరిగిందని, మత్స్య కారులు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. చేపలను అమ్ముకోవడానికి మత్స్యకారులకు ట్రక్ లు, ట్రాలీ ఆటోలు, ద్విచక్ర వాహనాలు సబ్సిడీ పై అందజేసినట్లు చెప్పారు. అదేవిధంగా వివిధ రకాల చేపల వంటకాలను అమ్ముకోనేందుకు వీలుగా సంచార విక్రయ వాహనాలను కూడా అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంకా మిగిలిన అర్హులైన మత్స్య కారులకు కూడా సబ్సిడీ పై వాహనాలు అందజేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని ప్రకటించారు. వచ్చే నెల 8 వ తేదీన మృగశిర కార్తె సందర్బంగా మొదటి సారిగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఫిష్ పుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఫెస్టివల్ లో వివిధ రకాల చేపల వంటకాలను స్టాల్స్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. మత్స్యరంగం పై ఎంతో అనుభవం ఉన్న పిట్టల రవీందర్ చైర్మన్ గా బాద్యతలు చేపట్టడం వలన ఈ రంగం మరింత అభివృద్ధి లో ముందుకు వెళుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, MLC లు పాడి కౌశిక్ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, కార్పోరేషన్ చైర్మన్ లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, కోలేటి దామోదర్ గుప్తా, గెల్లు శ్రీనివాస్ యాదవ్, అల్లం నారాయణ, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
Home
Telangana
మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు
Related Posts
Spread the love హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం నుంచి స్వల్ప సంఖ్యలో పోలింగ్ నమోదైంది. కాగా, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం, ఐడీ కార్డు వెరిఫికేషన్ చేయడం…
Spread the love మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనినేరెడ్మెట్ లోని ఇండియన్ హైస్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న శ్రీమతి. నడింపల్లి యమున పాఠక్ప్రముఖ సామాజికవేత్త, సైకాలజిస్ట్, బిజేపి సీనియర్ నాయకురాలు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇంటి నుండి బయటకు…
Spread the love శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ తరుణంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. నరేంద్ర…
Spread the love చేవెళ్ల గడ్డపై రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శంకర్పల్లి మున్సిపల్ కేంద్రంలో గల పోలింగ్ బూత్ లను కొండ విశ్వేశ్వర్ రెడ్డి…
Spread the love పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శంకర్పల్లి మండల వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ప్రొద్దుటూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వైస్ ఎంపీపీ ప్రవళిక…
Spread the love ధర్నాకు దిగిన రాజకీయ పార్టీల నేతలు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రతినిధి)చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం శంకర్పల్లి మండల్ పర్వేద గ్రామములో శంకర్పల్లి శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఏ నాగరాజు తన సిబ్బందితో…
Spread the love పార్లమెంటు ఎన్నికల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, కుమారులు,కోడళ్ళు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డు బూత్ నెంబర్ 67 లోని మల్లు వెంకట…
Spread the love Srisailam Goud even after exercising the right to vote గాజులరామారంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ తత్వ గ్లోబల్ స్కూల్, 243 బూత్ లో క్యూ…
Spread the love ఓటు హక్కును వినియోగించుకున్న …..టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి కుటుంబ సమేతంగా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్…
Spread the love ఓటు ఒక హక్కే కాదు ఆయుధం కూడా ప్రతి ఓటర్ తమ ఓటును సద్వినియోగం చేసుకోండి – ఎమ్మెల్సీ,మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభీపూర్ రాజు. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ, శంభిపూర్ గ్రామంలో…