SAKSHITHA NEWS

బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ‘చార్‌షీట్‌’

రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం విఫ లమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ ఆరో పించారు.వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు చేపట్టిన అవినీతి,అక్రమాలపై పోలీస్‌ స్టేషన్లలో చార్జ్‌షీట్స్‌ అందిస్తున్నట్టు తెలిపారు.ఈ మేరకు బెజ్జిపురం జంక్షన్‌లో ఎచ్చెర్ల నియోజకవర్గం బీజేపీ కన్వీనర్‌ నడుకుదిటి ఈశ్వర రావు అధ్యక్షతన నాయకులు కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని,దీన్ని అరిక ట్టేందుకు బీజేపీ ప్రజా పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రెడ్డి పావని, ఇజ్జాడ శ్రీనివాసరావు,పీవీ రత్నం, వీరబాబు, ఎస్‌.నాగేశ్వరరావు, వి.రఘురాం, ఎల్‌.అప్పలనాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS