*సాక్షిత : రేణిగుంట సిఆర్ఎస్ సమీపంలోని కేంద్రియ విద్యాలయంను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పలువురు విద్యార్థులు ముఖ్యంగా పర్మినెంట్ అధ్యాపకుల లేమి వలన వారు పడుతున్న ఇబ్బందుల గూర్చి ఆలాగే వాష్ రూమ్స్ అపరిశుభ్రంగా ఉంటున్నాయని విద్యార్థులు ఎంపీ గురుమూర్తికి ఏకరువు పెట్టారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొన్నారు. సమస్యలన్నీ కేంద్రియ విద్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకొంటామని విద్యార్థులకి చెప్పారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని వారిని ఉత్తేజ పరిచారు.
కేంద్రియ విద్యాలయం – 2 ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
Related Posts
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని
SAKSHITHA NEWS రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆహార భద్రత కోసం కేంద్రం అందించిన రూ.65 కోట్లు నిరుపయోగం కేంద్రం…
వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు
SAKSHITHA NEWS వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావుసాక్షిత : పరవాడ వై.సి.పి సీనియర్ కార్యకర్త పైల రాధాకృష్ణ ఎన్టి.పి.సి లో ఉద్యోగ నిమిత్తం పని చేస్తుండగా ప్రమాద వశాత్తు కాలు జారీ పడిపోవడం తో పరవాడ శ్రీ ఆధ్య హాస్పటల్…