SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

జగనన్న పాలనతోనే బంగారు భవిష్యత్తు

    సర్పంచి గుడ్డెపోగు రమేష్

సుంకేసుల ఎస్సీ పాలెం లో ఘనంగా నువ్వే జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం

పెద్దారవీడు:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలననాలోనే బంగారు భవిష్యత్తును వినియోగిస్తున్నామని మండల సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు,సుంకేసుల సర్పంచి గుడ్డెపోగు రమేష్ అన్నారు. జగనన్న నువ్వే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధిశాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో మండలంలోని సుంకేసుల గ్రామంలో సర్పంచి రమేష్, ఎస్సీ పాలెంలోని వైసీపీ నాయకులు జగనే మా భవిష్యత్తు స్టిక్కర్లను గడపగడపకు అతికించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్రలు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన తర్వాత95 శాతంమేర పథకాలను అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు.

కుల మతాలకతీతంగా ముఖ్యంగా పార్టీ ఓటు వేయని వారికి కూడా అర్హులందరికీ పథకాలన్నీ అందించడంతోపాటు స్థానిక సమస్యలను సైతం పరిష్కరించేందుకు సీఎం సచివాలయ కన్వీనర్లు, గృహసారధులను నియమించడం జరిగిందన్నారు.రానున్న రోజుల్లో మంత్రి సురేష్ ఆధ్వర్యంలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం తంగిరాల మరియమ్మ,గుడ్డెపోగు నడిపి సుబ్బయ్య లు గోడలకు అంటించిన స్టిక్కర్ను చూసి మళ్లీ నువ్వే సీఎం గా రావాలి జగనన్న అని దండం పెట్టడంతో వైసీపీ నాయకులు ఆనంద వ్యక్తం వ్యక్తం చేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ గుడ్డెపోగు వెంకటసుబ్బయ్య,వార్డు నెంబర్లు పండిటి నాగయ్య, కటారి చిన్న కొండయ్య, భూతపాటి లుదియ ఇర్మియా,అధిక సంఖ్యలో వైసీపీనాయకులు, కార్యకర్తలు,వాలంటీర్లు, గృహసారథులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS