SAKSHITHA NEWS

గడప గడపకు మన ప్రభుత్వం, మైలవరం నియోజకవర్గం. 4.4.2023

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని సచివాలయం-4 పరిధిలో దేవుని చెరువులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్ధానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు మంగళవారం ఉదయం పాల్గొన్నారు.

సీఎం జగనన్న నాయకత్వంలో రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేద లబ్ధిదారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అర్హతలను బట్టి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పేదలు ఎంతో సంతోషంగా ఉన్నారని, ప్రతి గడపలో ఇవే అనుభవాలు ఎదురవుతున్నాయని శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.

ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ, చిన్నారులకు ఆశీస్సులు అందజేస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఎంతో ఉత్సాహంగా కార్యక్రమం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS