ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

Spread the love

ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

_ మొదటి వోటు వేసిన సీఎం జగన్

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్ ముగిసిన గంట తర్వాత అంటే..సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలుకానుంది. అందర్నీ ఏకకాలంలో తరలించే ప్రయత్నాల్లో ఉంది టీడీపీ. చంద్రబాబుతో కలిసే ఓటింగ్‌కి వెళ్లబోతున్న 19 మంది ఎమ్మెల్యేలు. ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు మెజార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు. ఈ పోలింగ్ మొత్తం విప్ వర్సెస్ ఆత్మప్రబోధానుసారం కాన్సెప్ట్‌లో జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోటీచేస్తున్న ఒక్క సీటును గెలిచితీరతామంటున్నాయి టీడీపీ వర్గాలు. లేదు లేదు ఏడుకు ఏడు సీట్లు తమవేనన్న ధీమాలో ఉంది వైసీపీ. ఎవరి ధీమా వాళ్లకు ఉన్నా.. ఎవరి టెన్షన్ కూడా వాళ్లకుంది. ఎందుకంటే.. ఈ పోటీల్లో గెలుపోటములను రెబల్స్ టెన్షన్ ప్రభావితం చెయ్యబోతోంది.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page