విశాఖ రామజోగిపేటలో కూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి

Spread the love

విశాఖ రామజోగిపేటలో కూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి


సాక్షిత విశాఖపట్నం/
జగదాంబ కూడలి(విశాఖ) విశాఖ నగరం కలెక్టరేట్‌ సమీపంలోని రామజోగిపేటలో అర్ధరాత్రి మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది..
ఈ ఘటనలో బాలిక సాకేటి అంజలి(14), దుర్గాప్రసాద్‌(17)తో పాటు మరొకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో కొమ్మిశెట్టి శివశంకర, సాకేటి రామారావు, సాకేటి కల్యాణి, సున్నపు కృష్ణ, సాతిక రోజారాణి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో పరిసర ప్రజలు భయాందోళనలో ఉన్నారు..

ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 8 మంది ఉన్నారు. మరోక వ్యక్తి చోటు ఆచూకీ కోసం శిథిలాల కింద గాలింపు చేపట్టారు. గాయపడిన ఐదుగురిని కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని డీసీపీ సుమిత్‌ గరుడ పరిశీలించారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page