SAKSHITHA NEWS

గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ..
పటాన్చెరులో పెల్లుబికిన నిరసన
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన
భారీ సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు.


సాక్షిత : పటాన్చెరు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. భారీ సంఖ్యలో భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.


SAKSHITHA NEWS