బండి సంజయ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన అమిత్ షా.. వారికి వేరే పదవులు

SAKSHITHA NEWS

బండి సంజయ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన అమిత్ షా.. వారికి వేరే పదవులు

BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
దీంతో ఈ రకమైన చర్చకు తెరపడినట్టే అని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర నేతలతో సమావేశానికి ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో తాజా పరిస్థితులను అధ్యయనం చేసిన అమిత్ షా, నడ్డా బండి సంజయ్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఆయా పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు పార్టీ అధ్యక్షుడి మార్పుపై చాలా ఆశలు పెట్టుకున్నారు

.
అయితే సంజయ్ నాయకత్వం పట్ల ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేయడంతో ఇదే విషయాన్ని అమిత్ షా, నడ్డా రాష్ట్ర నేతలకు చెప్పినట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారికి జాతీయస్థాయిలో ప్రత్యామ్న్యాయ పదవులు కట్టబెట్టాలన్న ఆలోచన బీజేపీ అధినాయకత్వం చేస్తున్నట్లు సమాచారం.బీజేపీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ ఎంతో బలోపేతమైందని ఆయన చేస్తున్న పోరాటాలు, నిర్వ హించిన ప్రజా సంగ్రామ యాత్రల వల్ల బీఆర్ఎస్‌కు పోటీ ఇస్తున్నట్టు అగ్రనేతలు వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఇటీవల జరిగిన బీజేపీ ప్లీనరీ సమావేశంలోనూ బండి సంజయ్ పనితీరును ప్రశంసించిన మోడీ ఆయనను ఇతర నేతలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.

ఇక ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను మార్చాలని రాష్ట్రానికి చెందిన కొందరు వలస నేతలు చేస్తున్న ప్రయత్నాలకు అధినాయకత్వం గండికొట్టడంతో వారి ఆశలు బ్రేక్ పడినట్టయ్యింది. బండి సంజయ్ నాయకత్వంలో కచ్చి తంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరు తుందని పార్టీ సీనియర్లు ఆయనతో సమన్వయం చేసుకుని ప్రజలకు చేరువై పనిచేయాలని కోరినట్లు సమాచారం.


SAKSHITHA NEWS

sakshitha

Related Posts

rahul తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSrahul తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కాసేపు తాపీమేస్త్రి అవతారం ఎత్తారు. భవన నిర్మాణ కార్మికులతో కలసి పార, తాపీ పట్టుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఓ…


SAKSHITHA NEWS

world ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSworld ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇప్పటికే మూడు రథాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఈనెల 7న ప్రారంభమై 16…


SAKSHITHA NEWS

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page